BRS Top Leaders Disappointment : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పేలా లేదు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. ఇక ఈ పోరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మాత్రమే కీలకంగా మారాయి. అయితే అధికార బీఆర్ఎస్ మాత్రం ఇప్పుడు కూడా తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవాలని చూడడం కనిపిస్తున్నది. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ఇంకా పొరుగు రాష్ర్టం నేతలపై అక్కసు వెళ్లగక్కుతూ ఆ పార్టీ అగ్రనేతలు మాట్లాడడం ఇక్కడ కనిపిస్తున్నది.
తాజాగా మంత్రి హరీశ్ రావు కూడా ఇదే రీతిలో మాట్లాడారు. ఈ తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ ఎంతో సాధించిందని, ఏపీ ఎంతో నష్టపోయిందని ప్రసంగం కొనసాగించారు. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ చంద్రబాబును బూచిగా చూపించి ప్రచారం చేసింది. మరోసారి అదే ఫార్మూలా ను ముందుకు తేవాలని చూసింది. కానీ చంద్రబాబు అరెస్టవ్వడం దానికి కలిసిరాలేదు.
ఇక తెలంగాణ ద్రోహులందరూ ఒక్కటవ్వతున్నారని, బీజేపీతో పవన్ జత కలిశారని, ఇక కాంగ్రెస్ కు షర్మిల నేరుగా నే సపోర్టు ఇస్తున్నదని, టీడీపీ అధినేత చంద్రబాబు లోపాయికారిగా రేవంత్ రెడ్డికి సపోర్టు ఇస్తున్నాడని, అందుకే వారందరూ పోటీలో ఉండడం లేదని చెప్పుకొస్తున్నారు.
ఇక తెలంగాణ ఉద్యమసమయంలో రేవంత్ రెడ్డి తీరును ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇద తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ ద్రోహులకు జరుగుతున్న యుద్ధమని మాట్లాడుతున్నారు. అయితే సెంటిమెంట్ ను వాడుకోవడం, ఆంధ్రా నేతలపై విద్వేషం చిమ్మడం బీఆర్ఎస్ కు కొత్తేమి కాదు. తెలంగాణ లో అధికారాన్ని దక్కించుకోవడానికి మాత్రం ఏపీ ని వాడుకుంటున్నది.
అయితే తెలంగాణ పేరు మీద ఉన్న పార్టీని మార్చి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ను వల్లెవేయడం వారికే సాధ్యమైంది. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ప్రసంగాలు మరోసారి విద్వేషాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్ ను రేపి ఓట్లను దున్నుకోవాలని చూస్తున్నట్లుగానే కనిపిస్తున్నాయి. కానీ ఇఫ్పటికే తెలంగాణ ఓటరు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా గ్రౌండ్ లెవల్ పరిస్థితి కనిపిస్తున్నది.