![CM Chandrababu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-15-1.jpg)
CM Chandrababu : ఢిల్లీలో రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం కేంద్రమంత్రి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కలిశారు. సీఎంతో పాటు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ, టీడీపీ ఎంపీలు, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ కేంద్రమంత్రితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్ లో ఏపీ అంశాలకు ప్రాధాన్యత నిధుల కేటాయింపు చేయాలని ఆర్థిక మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రాన్ని ఆుకోవాలని, పలు ప్రాజెక్టులకు ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం, అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు.