Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. కానీ నేటికాలంలో ఆడవాళ్ల నుంచి మగవారికి కూడా వేధింపులు పెరిగిపోయాయి. కాకపోతే మగవాళ్లు బయట చెప్పుకోలేక తమలో తామే కుంగిపోతున్నారు. సూటిపోటి మాటలతో ఇంట్లో పెట్టే టార్చర్ భరించలేక పలువురు భర్తలు బార్ షాపుల్లో సేదతీరడం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు అమాయక భర్తలు తమ బాధలను బయటకు చెప్పుకోలేక ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు.
పెళ్లాం పోరు పడలేక ఓ భర్త సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కొంపల్లిలో జరిగింది. తన భార్య చీటికి మాటికి ఇబ్బంది పెడుతోందని వాపోయాడు. ఆమె టార్చర్ భరించడం తన వల్ల కాదంటూ ఆత్మహత్యే శరణ్యమని చెరువులోకి దిగాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. సదరు యువకుడు నగేశ్ ను బయటకు రావాల్సిందిగా బతిమాలారు. అయితే తన భార్యతో ఎలాగైనా విడాకులు ఇప్పించాలని కోరాడు భర్త నగేశ్. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు అతడి బాధ విని పరిష్కారం చూపుతామని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కొంపల్లిలో తన భార్యత కలిసి ఉంటున్నాడు నగేశ్. అయితే కొంతకాలంగా భార్య వేధింపులు తాళలేకపోతున్నా అని చెప్పాడు. తన పిల్లలకు ప్రేమగా చాక్లెట్లు తీసుకొచ్చి ఇస్తే వాటిని ఇవ్వకుండా చేస్తోందని, పైగా మాట్లాడించేందుకు కూడా నిరాకరిస్తోందని వాపోయాడు. అడిగితే వాతలు పెడుతోందని తన టీ షర్ట్ విప్పి మరీ చూపించాడు. గత కొన్ని రోజులుగా ఈ టార్చర్ భరిస్తూ వచ్చిన నగేశ్ చివరకు చనిపోయాలని నిశ్చయించుకున్నాడు. కొంపల్లి సమీపంలోని జయభేరి పార్క్ వద్ద ఉన్న చెరువులో దిగాడు. గమనించిన స్థానికులు ఎందుకు చెరువులో దిగావు అని ప్రశ్నించగా తన గోడు వెల్లబోసుకున్నాడు. నగేశ్ కు నచ్చజెప్పి విడాకులు ఇప్పిస్తామని చెప్పడంతో చెరువులో నుంచి బయటకు వచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నా భార్య నన్ను కొడుతోంది.. నాకు విడాకులు ఇప్పించకుంటే సచ్చిపోతా అంటూ చెరువులో దిగిన వ్యక్తి
హైదరాబాద్ – నగేశ్ అనే వ్యక్తి కొంపల్లి జయభేరి పార్క్ చెరువులోకి దిగి నా భార్య నన్ను కొడుతోంది.. నా పిల్లల దగ్గరకు నన్ను రానివ్వడం లేదు, నాకు విడాకులు ఇప్పించండి, లేదంటే సచ్చిపోతా అంటూ… pic.twitter.com/izaSB5y42x
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024