Crime News : పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైం డీసీపీ కవిత తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో జనవరిలో కేసు నమోదు చేశామని, నిందితులు నౌషద్, కబీర్ కేరళలో ఉన్నట్లు గుర్తించి.. స్పెషల్ టీం అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆమె శనివారం (ఏప్రిల్ 13) ఆమె మీడియాకు వెల్లడించారు. పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పిస్తామని ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా గ్రూపును క్రియేట్ చేశాడు.
‘లింక్ షేర్ చేసి.. దాన్ని క్లిక్ చేయడం ద్వారా బాధితులను యాడ్ చేస్తారు. లైక్, లింక్స్ షేర్ లతో పాటు అంతర్జాతీయ కంపెనీలకు రివ్యూలు రాయడం లాంటి టాస్క్లు ఇస్తారు. పార్ట్ టైం ఉద్యోగం, అందునా వర్క్ ఫ్రం హోం లాంటివి కావడంతో చాలా మంది అందులో చేరారు. జాబ్లో చేరిన తర్వాత వారికి వచ్చే జీతంతో పెట్టుబడులు పెట్టించి దానికి కొంత నగదు యాడ్ చేసి మరీ ఇస్తారు. వారి మాటలకు బోల్తా పడిన బాధితులు రూ.9 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టారు. అయితే, పెట్టుబడులు, లాభాలు చెల్లించకుండా నిందితులు సదరు అకౌంట్ బ్లాక్ చేశారు. ఖాతా స్తంభించింది.. కాబట్టి నగదు రిలీజ్ అవ్వాలంటే మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని చెప్పారు.
వేర్వేరు అకౌంట్లలోకి డబ్బులు జమ చేయిస్తారు. ఇలా 18 బ్యాంకు ఖాతాలల్లోకి దాదాపు రూ. 26 కోట్ల వరకు వసూలు చేయించుకున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తులో విషయం తేలడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. డబ్బుల ట్రాన్జక్షన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ వివరించారు.