Tamilnadu News :తమిళనాడు తంజావూరులో ఎస్సీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని ఓ తండ్రి తన కూతురు ఐశ్వర్య ను హత్య చేశాడు. నవీన్, ఐశ్వర్య స్కూ ల్లో డేస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే నవీన్ ఎస్సి కులానికి చెందినవాడు ఐశ్వర్య బీసీ కులానికి చెందిన యువతి వీరిద్దరు ప్రేమ వివాహం చేసుకొని తిరుపూర్ లో ఉద్యోగం చేస్తూ కలిసి ఉంటున్నారు.
డిసెంబర్ 31న వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న వీడియో ఫైరల్ కావడంతో ఐశ్వర్య ను తండ్రి ఇంటికి బలవంతంగా తీసుకువచ్చాడు. జనవరి 3న ఆమె విగతజీవిగా కనిపించింది. ఈ కేసులో తండ్రి సహా 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కులాంతర ప్రేమ వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేక ఇలా కన్న కూతురిని హత్య చేశాడు.