Rameswaram Cafe : రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ట్ కేస్ పై NIA దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి NIA బుధవారం తమిళనాడులో సోదాలు చేపట్టింది. తమిళనాడు రాజధాని చెన్నై, రామనాథపురంలో 10 చోట్ల NIA అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమానితుల ఇళ్లు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మొత్తం మీద కేసు దర్యాప్తు ను NIA అధికారాలు వేగవంతం చేశారు. బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలో సోదాలు నిర్వహించారు.