Mansoor Ali Khan : రెండు రోజుల క్రితం గుండెనొప్పతో మన్సూర్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. తమిళనాడులోని వేలూరు లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. తనకు ఎవరో జ్యూస్ లో విషం కలిపి ఇచ్చారని మన్సూర్ ఆరోపిస్తున్నారు.
గుడియాత్తం సంత నుంచి ఇంటికి బయల్దేరుతుండగా కొందరు తనకు పండ్లరసం ఇచ్చారని, జ్యూస్ తాగిన కొంత సేపటికే గుండెనొప్పి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నటుడు మన్సూర్ అలీఖాన్ డెమోక్రటిక్ టైగర్స్ ఆఫ్ ఇండియా పేరుతో పార్టీని నడుపుతున్నా.. దానిని ఎన్నికల సంఘం ఇప్ఫటి వరకు ఆమోదించక పోవడంతో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. జాక్ ఫ్రూట్ గుర్తును ఆయనకు ఈసి కేటాయించింది.