These are reduces the Diabetes : డయాబెటిస్ వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. షుగర్ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని మూలికలు తీసుకోవాల్సిందే. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించుకునేందుకు మన ఆహారాల విషయంలో శ్రద్ధ పాటించాల్సిందే. లేకపోతే షుగర్ స్థాయిలు పెరిగి నష్టాలు రావడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో మధుమేహులు తినే ఆహారాలేంటో తెలుసుకుని మరీ తినడం మంచిది.
రోజ్ మేరీ తైలం డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో జిన్సెంగ్ తైలం ఎంతో దోహదపడుతుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండటం వల్ల దీన్ని తీసుకుంటే కార్బోహైడ్రేడ్లు, శోషణ రేటును తగ్గిస్తుంది. ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపుతుంది.
సీజ్ తైలం చక్కెరను వేగంగా నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో దీన్ని తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు సాయపడుతుంది. టీ రూపంలో దీన్ని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. కలబంద కూడా షుగర్ ను అదుపులో ఉంచుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల మధుమేహాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కూడా మధుమేహానికి మంచి మందులా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో అల్లం టీ ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షుగర్ ను నియంత్రించడంలో మెంతులు కూడా ఉపయోగపడతాయి. రోజు గుప్పెడు మెంతులు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.