Diabetes controlled : ఈ రోజుల్లో షుగర్ సాధారణ సమస్యగానే చూస్తున్నారు. దీంతో ఇది చాపకింద నీరులా విస్తరిస్తోంది. డయాబెటిక్ కు రాజధానిగా మారుతోంది. మధుమేహం ఉంటే మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకపోతే నష్టాలు రావడం సహజం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల షుగర్ ను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
మధుమేహం ఉన్న వారు జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు. బార్లీని తమ ఆహారంలో భాగంగా చేర్చుకుంటే సంతోషంగా ఉండొచ్చు. ఇవి తేలిగ్గా జీర్ణమవుతాయి. ఇందులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువగా తినాలనే ఆలోచన ఉండదు. ఫలితంగా మనం తక్కువ ఆహారం తీసుకున్నా ఎక్కువ సమయం కడుపు నిండినట్లుగా ఉండటం వల్ల మనకు లాభం కలుగుతుంది.
డయాబెటిస్ కు పెసలు కూడా మంచి ఆహారమే. వీటిని రోజు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయని అంటుంటారు కానీ ఇవి తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. కడుపులో త్వరగా జీర్ణమయ్యేందుకు సహకరిస్తుంది. ఇలా పెసర పప్పు కూరల్లో వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మన ఆరోగ్య పరిరక్షణలో ఇది దోహదపడుతుంది.
ఆయుర్వేదం ప్రకారం రెడ్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆకలిని నియంత్రణలో ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో రెడ్ రైస్ తినడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దక్కుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.