Dried Fish : ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా మారింది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అంతకుముందు విచ్చలవిడిగా తిన్నా ఎలాంటి ఆంక్షలు లేకుండా పోయేవి. డయాబెటిస్ వచ్చాక డైట్ తీసుకోవడంలో కచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. ఎలా పడితే అలా తినడం శ్రేయస్కరం కాదు. మనం తినకూడినవే తినాలి. తినకూడనివి ముట్టుకుంటే ప్రమాదమే.
పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటే మంచి బలంగా ఉంటుంది. ఉసిరి, బత్తాయిలు, విటమిన్ ఏ, అవిసె, గుమ్మడి గింజలు రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. శరీర భాగాలను రోజు శుభ్రం చేసుకోవాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా తడిగా ఉంటే ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. అందుకే జాగ్రత్తగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు ముప్పులేకుండా ఉంటుంది.
వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మూడు నుంచి ఆరు నెలలకొకసారి హెచ్ బీఏ1సీ పరీక్ష చేయించుకుంటూ ఉండాలి. ఇది 56-6 శాతం లోపు ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇలా షుగర్ ను ఎప్పుడు కూడా కంట్రోల్ లో ఉంచుకుంటేనే సురక్షితం. ఇలా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకుంటే దుష్ఫలితాలు రాకుండా ఉంటాయి.
షుగర్ వచ్చిందంటే గాబరా పడిపోకుండా నిదానంగా జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి ఉపద్రవాలు రాకుండా చూసుకోవాలి. డైట్ తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. కొందరు షుగర్ వచ్చిందంటే ఇక ఏదో జరిగిపోయినట్లు భయపడుతుంటారు. కానీ అలాంటిదేమీ ఉండదు. జాగ్రత్తలు తీసుకుంటుంటే డయాబెటిస్ వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
షుగర్ ఉన్న వాళ్లు ఎండు చేపలు తినకూడదు. కానీ చాలా మంది పట్టించుకోరు. మధుమేహం ఉన్న వారు ఎండు చేపలు తింటే శరీరానికి ఇబ్బందులు ఉంటాయి. పచ్చి చేపలు తినొచ్చు. ఎండు చేపలు ముట్టుకోకూడదు. ఈ విషయం వైద్యులు కూడా చెబుతారు. అందుకే ఎండు చేపలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరమని గుర్తుంచుకుని వాటిని తినకుండా ఉండాలి.