Dil Raju predictions : ప్రభాస్ నటించిన సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విమర్శల పాలైనా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. జూన్ 16న విడుదలై బాక్సాఫీసు రికార్డులు సృష్టిస్తోంది. మొదటి ఆట నుంచే వివాదాలకు కేంద్ర బిందువుగా మారినా కలెక్షన్లు బాగానే ఉన్నాయనే వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాపై మిశ్రమ స్పందన వస్తోంది.
ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకోవాలని దిల్ రాజును కోరినా ఆయన వెనకడుగు వేశారు. దాని ట్రైలర్ చూసిన ఆయన సినిమాపై అంచనాలు వేసుకున్నారు. దీంతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ ఫ్యాక్టరీ రూ. 185 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. తెలుగు రైట్స్ రాజుకు అమ్మాలని చూసినా ఆయన విముఖత చూపడంతోనే ఇతరులకు వెళ్లింది.
దిల్ రాజు శాకుంతలం సినిమా హక్కులు తీసుకుని రూ.30 కోట్ల వరకు నష్టపోవడం జరిగింది. అందుకే ఆదిపురుష్ విషయంలో దూరంగా ఉన్నారు. టీజర్ చూసే దిల్ రాజు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యాపారపరంగా కలెక్షన్లు బాగానే ఉన్నా భవిష్యత్ లో ఇంకా ఎంత లాభం సాధిస్తుందో వేచి చూడాల్సిందే మరి.
దిల్ రాజు దూరదృష్టి ఉన్న నిర్మాత కావడంతోనే ఆదిపురుష్ హక్కులు తీసుకోలేదని టాక్. కానీ ఆదిపురుష్ ఆదిలో విమర్శలు ఎదుర్కొన్నా తరువాత బాగానే దూసుకుపోతుందనే టాక్ వస్తోంది. దీంతో ఎంత టాస్క్ సాధిస్తుందో తెలియడం లేదు. ఆదిపురుష్ సినిమా గురించి ముందే అంచనా వేసి దిల్ రాజు పక్కకు తప్పుకున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.