Diwali Sneh Milan 2023 : రాజస్థానీ ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ రెసిడెంట్స్ దీపావళి స్నేహ్ మిలన్ కార్యక్రమాన్ని నవంబర్ 3, సాయంత్రం 6 గంటలకు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు వినీత్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 1050, కింగ్ జార్జ్ లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్ లో దీపావళి స్నేహ్ మిలాన్ కొనసాగింది.
ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మరింత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని యూ బ్లడ్ యాప్ కూడా స్పాన్సర్ చేసింది. మల్టీ కుసీన్ ఫుడ్, ప్రీమియం ఓపెన్ బార్, ఓపెన్ డాన్స్ ఫ్లోర్, ఫైర్ క్రాకర్స్, డీజే, ధోల్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రూప్ డ్యాన్స్, లైవ్ పెర్ఫార్మెన్స్, చిన్న పిల్లల ఫ్యాన్సీ డ్రెస్, స్కిట్, సింగింగ్ వంటి ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యూ బ్లడ్ యాప్ ఫౌండర్, జైస్వరాజ్య టీవీ అధినేత జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారిని ఘనంగా సన్మానించారు. యూ బ్లడ్ యాప్ ద్వారా డాక్టర్ జగదీష్ గారు చేస్తున్న సేవలను నిర్వాహకులు, ప్రముకులు పొగడ్తలతో ముంచెత్తారు. రక్తదాతలు, గ్రహీతల మధ్య వారధిలా యూ బ్లడ్ యాప్ పనిచేస్తుందని, ఈ యాప్ ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకుదనిజై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు చేసిన గొప్ప పనికి అందరూ అభినందనలు తెలిపారు. యూ బ్లడ్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను కాపాడామని, మరింత ముందుకు తీసుకెళ్తామని జగదీష్ గారు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు సంస్థ అధ్యక్షుడు తరంగ్ సోనీ కృతజ్ఞతలు తెలిపారు.
All Images Courtesy by Dr. Shiva Kumar Annad