Minister Roja : నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా ఆస్తులు 2019లో రూ.9.03 కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ. 13.07 కోట్లకు పెరిగింది. అంటే ఈ ఐదేళ్లలో ఆమె ఆస్తులు 47 శాతం పెరిగాయి. ఎన్నికల అఫిడవిట్ లో రోజా తెలిపిన ప్రకారం రూ. 5.09 కోట్ల చరాస్తులు, రూ. 7.98 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. రూ. కోటి విలువైన బెంజ్ కారుతో పాటు 9 కార్లు ఉన్నాయని అఫిడవిట్ లో వెల్లడించారు.
2019లో వైసీపీ తరపున నగరి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆర్కే రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.