vedio ఓ నర్సింగ్ కాలేజ్ విద్యార్థిని వీడయోను మరో ముగ్గురు అమ్మాయిలు చిత్రీకరించారనే వార్త సంచలనం సృష్టించింది.
ఈ సంఘటన జరిగా వారం రోజులు గడుస్తున్నా వీడియో రికార్డ్ కు పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం పై తీవ్ర ఆందోళనలు కలుగుతున్నాయి.
కర్ణాటక రాష్ట్రం లోని ఉడిపి పట్టణంలో గల ఓ మహిళా నర్సింగ్ కళాశాలకు చెందిన అమ్మాయి నగ్నంగా ఉండే వీడియోను ఆ కాలేజికి చెందిన మరో ముగ్గురు విద్యార్థినులు సీక్రెట్ గా
రికార్డు చేశారు.ఇది జరిగి ఏడు రోజులు అయినా నిందితులపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఉడిపి వాసి రష్మీ సమంత్ ట్విట్టర్ లో చేసిన పోస్టు సంచలనం అయింది.
వీరంతా ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రి నర్సింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ ఘటన ఈ నెల(జులై) 19న జరిగినట్లు తెలుస్తుంది. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో ఘటన వాస్తవేమనని ఆ కళాశాల డైరెక్టర్ తెలిపారు. వారి మొబైల్ ఫోన్ ను పోలీసులకు అప్పగించామన్నారు. కాగా ఈ ఘటన 1992 లో
జరిగిన అజ్మీర్ ఘటనను గుర్తు చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.
అజ్మీర్ కేసులో స్కూల్స్, కళాశాల లో చదివే విద్యార్థినుల నగ్న ఫోటోలను తీసి ఓ వర్గం వారు బ్లాక్ మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే విధంగా కొందరు ఓ వర్గానికి చెందిన అమ్మాయిల నగ్న వీడియోలు చిత్రీకరించి తమ వర్గాల వారికి పంపించడం జరుగుతుంది.