NRI Yarlagadda : ఇష్టం తో చదివితే తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతిభావంతులైన విద్యార్థులకు తానా తరఫున సహకారం అందిస్తామని తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ తెలిపారు. శుక్ర వారం నాడు ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు.
10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవు తున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్, పెన్స్, ఇతర సామాగ్రి అందజేశారు. రోటరీ నగర్ ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యా ర్థులకు, పాండురంగాపురం ఉన్నత పాఠశా లలో 76 మందికి, వెలుగుమట్ల ఉన్నత పాఠ శాలలో 15 మంది విద్యార్థులు ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు. పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు మధు, స్వర్ణలత, రవికిషోర్, వెంకటరమణకి ధన్యవాదాలు తెలిపారు. గోపాలపురం ప్రాథమిక పాఠశాలలో చిన్నారు లకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోనాల రామకృష్ణ, బండి నాగేశ్వరరావులు పాల్గొన్నారు.