H1B Visa :
ఇండియాలోని యూఎస్ మిషన్ 2023 లో ఒక మిలియన్ నాన్ ఇమ్మిగ్రేటేట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలనే లక్ష్యాన్ని అధిగమించింది. యఅితే అర్హత కలిగిన హెచ్, ఎల్ కేటగిరి ఉపాధి వీసా దరఖాస్తుదారుల కోసం దేశీయ వీసా పునరుద్ధరణను అనుమతించడానికి వచ్చే ఏడాది పైలట్ ప్రోగ్రాం అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నది. అయితే భారతీయుల నుంచి వీసాల కోసం అధిక డిమాండ్ ను యూఎస్ స్వాగతించింది. దేశంలో అత్యధిక పెట్టుబడులకు, కార్యకలపాలకు కూడా ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడుతున్నది.
మిషన్ యూఎస్ ఇప్పటికే 2022లో ప్రాసెస్ చేసిన లక్ష్యాలను అధిగమించింది. 2019 కంటే దాదాపు 20 శాతం ఎక్కువ అప్లికేషన్లను ఇక్కడ ప్రాసెస్ చేసింది. మిషన్ సామర్థ్యాన్ని పెంచడం, ఇంటర్వ్యూ మినహాయింపు,అర్హతను కొత్త వీసా వర్గాలకు పొడగించడం తదితర వ్యూహాలను అమలు చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా సిబ్బందిని భారతీయ వీసా ప్రాసెసింగ్ కు సహకరించేలా చేస్తున్నది
వచ్చేఏడాది పైలట్ ప్రోగ్రామ్ ద్వారా దేశీయ వీసా పునరుద్ధరణను త్వరగా చేపట్టాలని అనుకుంటున్నది. దేశంలో యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టిఈ మేరకు మాట్లాడుతూ భారత దేశంలో మా భాగస్వామ్యం యునైటెడ్ స్టేట్స్ భాగస్వామ్యంతో పాటు ద్వైపాక్షిక సంబంధాల్లో ఒకటిగా ఉంది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగంగా వీసా ప్రక్రియ చేపడుతామని చెప్పారు.
ఇక గతేడాది 1.2 మిలియన్లకు పైగా భారతీయులు యూఎస్ ను సందర్శించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రయాణ సంబంధాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీసా దరఖాస్తుదారుల్లో భారతీయులు 10 శాతం వాటా కలిగి ఉన్నారు. ఇందులో విద్యార్థి వీసా దారులు 20 శాతం ఉండగా, హెచ్ ఎల్(ఉపాధి) వీసా దరఖాస్తుదారులు 65 శాతం మంది ఉన్నారు. ఈ వృద్ధిని యూఎస్ స్వాగతిస్తున్నది. అమెరికా వీసాల కోసం కొనసాగుతున్న అధిక డిమాండ్ ను గుర్తించి, భారత్ లో పెట్టుబడులు పెంచాలని అమెరికా భావిస్తున్నది. ఈ క్రమంలోనే వీసాల ప్రాసెసింగ్ వేగంగా పూర్తి చేయడానికి భారత్ లో తన సిబ్బందిని పెంచుకుంది. ఇక వీసాల కోసం కొనసాగుతున్న అధిక డిమాండ్ ను గుర్తించి, చెన్నైలోని తమ కార్యాలయంలో గణనీయ మార్పలు చేయడంతో పాటు హైదరాబాద్ లో కొత్త కాన్సులేట్ ప్రారంభించింది.