విదేశీ పౌరులు మన దేశంలోకి రావాలన్నా.. మన పౌరులు వేరే దేశానికి వెళ్లాలన్నా వీసా ఉండాల్సిందే. వేరే దేశంలోకి ప్రవేశించడానికి అనుమతి తీసుకోవడమే వీసా. ఇది లేకుండా ఎవరైనా అక్రమంగా ప్రవేశించే ప్రయత్నం చేస్తే నిర్బంధించే అధికారం ఆ దేశానికి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు ఇటీవల పర్యాటకాన్ని ప్రొత్సహించాలనే ఉద్దేశంతో విదేశీలకు వీసా సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా, మలేషియా కూడా తమ దేశంలోకి వచ్చే భారత్, చైనా పౌరులకు వెసులుబాటు కల్పించింది.