Kurchi Thata : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తాజా మూవీ ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్స్ కు మేకర్స్ రెడీ అయ్యారు. తాజాగా ‘‘కుర్చీ మడతపెట్టి…’’ అనే సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. దీంతో ఈ సాంగ్ పై సోషల్ మీడియాలో రగడ మొదలైంది. కుర్చీ మడతపెట్టి.. దాని తర్వాత వచ్చే పదాలు పరమ బూతు అని, మహేశ్ లాంటి టాప్ హీరోకు అలాంటి పదాలు వాడడం ఏంటని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. త్రివిక్రమ్, మహేశ్ కాంబో అంటే జనాలు ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఎక్స్ పెక్ట్ చేస్తారని.. ఇలాంటి బూతు పాటను పెడితే ఆడియన్స్ ఇబ్బంది పడుతారని.. ఈ పదాలతో ఉన్న లిరిక్స్ నే చిన్న పిల్లల నుంచి పెద్దల దాక హామ్ చేసే పరిస్థితి వస్తుందని.. అంటున్నారు.
కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ ఎలా ఫేమస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కాలా పాషా అనే వరంగల్ కు చెందిన తాత హైదరాబాద్ లో ఏవేవో చిన్నపనులు చేసుకుని బతుకుతుంటాడు. కాకపోతే ఆ కాలంలోనే ఇంటర్ చదవడంతో ఇంగ్లీష్, హిందీలతో పాటు సినిమాలు, పాలిటిక్స్ లో అప్ డేట్ గానే ఉంటాడు. ఇక మన యూట్యూబర్లకు ఇలాంటి వారు దొరికితే పండగే కదా. ఓ యూట్యూబర్ ఇంటర్వ్యూ లో తాత ఇంగ్లీష్, ఉర్దూ, తెలంగాణ స్లాంగ్ లో అద్భుతంగా దంచికొట్టాడు. ఇక అదే సమయంలో తన బయోగ్రఫీని చెప్తూ.. తన భార్యకు, తనకు గొడవ జరిగితే అత్తగారింటికి వెళ్లానని, ఆ కోపంలోనే తన భార్య, ఆమె కుటుంబసభ్యులను ‘‘కుర్చీ మడత పెట్టి…’’ కొట్టానని చెప్పాడు. ఈక్రమంలో వచ్చిన కుర్చీ మడత పెట్టి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. కుర్చీ మడత పెట్టి అనేది ఒక ట్రెండింగ్ గా మారిపోయింది. కుర్చీ తాత.. అంటే చాలు గూగుల్ కూడా పాషా తాత పిక్ ను చూపిస్తుంది. అంతలా ఫేమస్ అయ్యాడు వరంగల్ తాత.
ఇక తన పేటెంట్ ఉన్న ‘‘కుర్చీ మడత పెట్టి..’’ డైలాగ్ ను సినిమాలో పెట్టుకునేందుకు తనను తమన్ ముందుగానే సంప్రదించినట్టు పాషా తాత చెప్పాడు. తన డైలాగ్ ను పాట పెట్టుకున్నందుకు తనకు లక్ష రూపాయలు కూడా ఇచ్చారని తెలిపాడు. మహేశ్ బాబు లాంటి పెద్ద స్టార్ మూవీలో తన డైలాగ్ తో పాటను పెట్టడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.