Mahesh babu సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ ”గుంటూరు కారం”.. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో రెండు సార్లు కలిసింది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి మాస్ మసాలా సినిమా కోసం కలవడంతో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయిన ఇండస్ట్రీ హిట్ గా మాత్రం నిలవలేక పోయాయి.. అయితే టీవీలో వేస్తె ఇప్పటికి ఈ సినిమాలకు మంచి రేటింగ్స్ అనేవి వస్తాయి.. అలా ఎప్పుడు చూసిన ఈ రెండు సినిమాలు ఆడియెన్స్ కు ఫ్రెష్ గానే అనిపిస్తాయి.. తాజాగా ఇప్పుడు వీరి కాంబోలో గుంటూరు కారం రాబోతుంది.
ఈ సినిమా ప్రకటించాక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకో ఈ జోడిఓ సినిమా అంటే సమయం ఎప్పుడు కాస్త ఎక్కువగానే సమయం పడుతుంది. అతడు రెండేళ్లు తీస్తే ఖలేజా మూడేళ్ళ సమయం తీసుకున్నారు.. ఇప్పుడు గుంటూరు కారం కూడా అదే కోవలోకి వస్తుంది. ముందు నుండి అనుకున్న వారు ఎంతో మంది ఈ సినిమా కోసం మారుతూనే ఉన్నారు.
మళ్ళీ కొత్త వారిని ఎంపిక చేసి షూట్ స్టార్ట్ చేయాలంటే సమయం పడుతూనే.. కేజిఎఫ్ ఫైట్ మాస్టర్స్ తో కొన్ని సీన్స్, పూజా హెగ్డేతో కొన్ని సీన్స్ చేసి పక్కన పెట్టారు. మళ్ళీ కొత్తగా కథను రాసుకుని తీయాలంటే సమయం వృధా అవ్వడమే కాకుండా మనీ కూడా వృధానే అవుతుంది. ఇలా ఇన్ని సమస్యల నేపథ్యంలో వీరి వల్ల నిర్మాతకు చుక్కలే కనిపిస్తున్నాయి అంటున్నారు.