దీంతో ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి. ప్రేక్షకులకు తమ కానుక ఇవ్వాలని అనుకుంటున్నాయి. దీని కోసం రెండు దేశాలు సై అంటే సై అంటున్నాయి. ఆసియా కప్ లో రెండు దేశాలు ఎన్ని సార్లు పాల్గొన్నాయి. ఎవరిది పైచేయిగా నిలిచింది. ఎవరు విజయం సాధించారనే అనుమానాలు అందరికి రావడం సహజమే. దీంతో వాటి వివరాలు తెలుసుకుందాం.
భారత్, పాకిస్తాన్ తొలిసారిగా బెలూచిస్తాన్ లో క్వెటా వేదికగా 1978లో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు రెండు దేశాల మధ్య 132 మ్యాచ్ లు జరగగా 73 మ్యాచుల్లో పాకిస్తాన్ 55 మ్యాచుల్లో ఇండియా విజయం సాదించాయి. నాలుగు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. దీంతో వారిదే పైచేయిగా ఉంది.
ఆసియా కప్ టోర్నీలో 1984లో షార్జాలో జరిగిన తొలి మ్యాచ్ లో పాక్ ను 54 పరుగుల తేడాతో ఓడించింది. చిరకాల ప్రత్యర్థి మీద కసి తీర్చుకుంది. ట్రోఫీని సైతం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో 46 ఓవర్లకు కుదించడతో భారత్ 188 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ సురీందర్ ఖన్నా 56 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు.
రెండేళ్లకోసారి నిర్వహించే ఈవెంట్లో 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018లలో భారత జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ ఇప్పటి వరకు 2000, 2012లో రెండుసార్లు మాత్రమే చాంపియన్ గా గెలిచింది. 2000 ఫైనల్లో శ్రీలంక 39 పరుగులు, 2012లో బంగ్లాదేశ్ ను 2 పరుగులతో ఓడించి చాంపియన్ గా అవతరించింది. టీమిండియా ఆరు వన్డేలు, ఒక టీ 20 ట్రోఫీలు గెలుచుకుంది.
ReplyForward
|