Varun Lavanya First Night Postponed : తాజాగా మెగా కుటుంబంలో మరో గ్రాండ్ వెడ్డింగ్ జరిగిన విషయం తెలిసిందే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం బుధవారం రాత్రి 7 గంటల 18 నిముషాలకు ఇటలీ లోని టస్కానీలో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఆరేళ్ళ తమ ప్రేమని పెళ్లిగా మార్చుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. మూడుముళ్లతో ఒక్కటయ్యిన ఈ జంటకు అందరు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అతి తక్కువ మంది సన్నిహితులు, మెగా, అల్లు కుటుంబం మాత్రమే హాజరవ్వగా వరుణ్ లావణ్య మెడలో మూడుముళ్లు వేసి తన జీవిత భాగస్వామిగా మార్చుకున్నాడు. అయితే వీరి పెళ్లి వేడుక విదేశాల్లో జరగడంతో రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుక నవంబర్ 5న ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, అతిథులు హాజరయ్యారు.
ఇక ఇది పక్కన పెడితే తాజాగా వరుణ్, లావణ్య గురించి మరో వార్త వైరల్ అవుతూనే ఉంది. వీరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుండి వీరి గురించి ఏదొక రూమర్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా వీరి పెళ్లి తర్వాత జరగాల్సిన అతి ముఖ్యమైన తంతు ఒకటి ఆగిపోయిందని అంటూ నెట్టింట రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
పెళ్లి తర్వాత జరగాల్సిన కీలక తంతు ఫస్ట్ నైట్ ఇంకా జ రగలేదట.. ఈ జంట ఇటలీలో పెళ్లి చేసుకోగా 5వ తేదీన రిసెప్షన్ కారణంగా వెంటనే ఇండియా తిరిగి వచ్చారని ఇక రిసెప్షన్ తర్వాత పంతులు గారిని పిలిపించి కుటుంబ సభ్యులు ముహూర్తం చేయించారట.. కానీ ఈ తంతును ఆయన వాయిదా వేసాడని టాక్.. ఈ వార్తల్లో నిజానిజాలు తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.