Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమా గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకుడు. సినిమా మొదటి నుంచి వివాదాల్లోనే కొనసాగింది. సినిమా నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. ఒక దశలో సినిమా నిర్మాణం ఆగిపోయిందనే వాదనలు కూడా వచ్చాయి. ఈనేపథ్యంలో గుంటూరు కారం పట్టాలెక్కుతుందో లేదో అర్థం కాని పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం రేపు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
త్రివిక్రమ్ సినిమా అంటే పంచ్ డైలాగులు ఉండటం సహజమే. కథలో ప్రాధాన్యం లేకున్నా స్టోరీని ఎలాగోలా నడిపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అలా ఆయన సినిమాలు ఆడుతుంటాయి. గుంటూరు కారం కూడా గుంటూరోడి సత్తా చూపిస్తుందని అంటున్నారు. మహేశ్ బాబుతో ఇంతకుముందు అతడు, ఖలేజా తీసి శభాష్ అనిపించుకున్నారు త్రివిక్రమ్. ఇప్పుడు గుంటూరు కారంతో ఎలాంటి ట్రెండ్ తీసుకొస్తాడోనని చూస్తున్నారు.
మహేశ్ బాబును మరో యువ హీరో మంచు మనోజ్ కుమార్ కలిశారు. కొత్త సినిమా గుంటూరు కారంతో గుంటూరోడి సత్తా చూపించాలని ఆకాంక్షించారు. వారిద్దరి ఫొటోను సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు చేశారు. మంచి మనసున్న మహేశ్ బాబును కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. గుంటూరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
మాస్టర్ మైండ్ త్రివిక్రమ్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. బాక్సాఫీస్ హిట్ కావాలని కోరుకున్నారు. సినిమా నేడు విడుదల కానుంది. సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. సూపర్ స్టార్ మహేశ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని అందరు అంచనా వేస్తున్నారు. కానీ ఏమవుతుందో చూడాల్సిందే మరి. సినిమా హిట్టా? ఫట్టా అనేది కొద్ది సమయంలో తేలిపోతుంది.