Mahesh-Rajamouli movie : ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయంలోనే తన తర్వాతి ప్రాజెక్ట్ మహేశ్ బాబుతో ఉంటుందని అంతా అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ సందర్భంగా సినిమా రూపు రేఖలు, మహేశ్ బాబు పాత్ర తదితరాలపై క్లారిటీ ఇచ్చాడు. విజయేంద్రప్రసాద్ కథ పూర్తవగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ఉపయోగించే బడ్జెట్ పై ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు మించి దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట రాజమౌళి. ఈ సినిమాకు పని చేసే టెక్నీషియన్స్ ను హాలీవుడ్ నుంచి తీసుకువస్తున్నారట.
ఆర్ఆర్ఆర్ తో రూ. 1100 కోట్ల గ్రాస్ ను రాబట్టాడు దర్శక ధీరుడు. మహేశ్ బాబుతో చేసే ఈ సినిమా అడ్వెంచర్ గా ఉంటుందని, హాలీవుడ్ మూవీ ‘ఇండియానా జోన్స్’ లాంటి కథ ఉంటుందని చెప్పుకచ్చారు. యాక్షన్, అడ్వెంచరస్ సీన్లతో మూవీని ప్లాన్ చేస్తున్నారట. అమెజాన్ అడవుల్లో చిత్రీకరణకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ మూవీ కోసం ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలను కూడా బుక్ చేసుకున్నారట.
వీటన్నింటి నేపథ్యంలో అనుకున్న దాని కంటే బడ్జెట్ మూడింతలు పెరిగే అవకాశం ఉంటుందని రాజమౌళినే చెప్తున్నారట. ఒక్క ఇండియానే కాదు.. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాను తీస్తున్నారట. బడ్జెట్ అయితే ఇప్పటి వరకు రూ. 800 కోట్లుగా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ మొదలైన తర్వాత బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. సినిమా ప్రీ ప్రొడక్షన్కి రూ. 100 కోట్లు ఖర్చు చేస్తారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంత భారీ మొత్తం ఇండియాలో ఏ సినిమాకు ఖర్చు చేసినట్లు దాఖలాలు లేవు. ఈ బడ్జెట్ నిజమైతే ఈ మూవీ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా రికార్డులను తిరగరాస్తుంది. మహేష్ ‘గుంటూరు కారం’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా (జనవరి 12) ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇటు గుంటూరు కారం జరుగుతుండగానే మహేశ్ బాబు తర్వాతి సినిమాకు రాజమౌళి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి, ఏప్రిల్ లో ప్రారంభం కానుంది.