Nara Lokesh :
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. టీడీపీకి అధికారం తీసుకురావాలనే ఉద్దేశంతో యువగళం పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్నాడు. ప్రజల కోసం కష్టపడే నాయకుల్లో లోకేష్ కూడా ఒకరు. అటు తండ్రి ఇటు తనయుడు పార్టీ భవిష్యత్ కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. దీనికి తోడు లోకేష్ తల్లి భువనేశ్వరి కూడా కొడుకు రాజకీయ ప్రస్థానంపై ధీమా వ్యక్తం చేస్తోంది. లోకేష్ అనుకున్నది సాధిస్తాడని ధీమాగా చెబుతోంది.
ప్రజా జీవనంలో మమేకం అయ్యే వారికి వ్యక్తిగత జీవితాలు తక్కువే. నిరంతరం ప్రజల్లోనే ఉండాలి. వారితోనే గడపాలి. అప్పుడే పార్టీ వ్యవహారల్లో స్పష్టత వస్తుంది. ప్రజల్లో గుర్తింపు లభిస్తుంది. లోకేష్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. ప్రజలతో నిత్యం కలిసిపోతున్నాడు. ప్రజా సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉంటున్నాడు.
పాదయాత్రతో మరోమారు టీడీపీని అధికారంలో నిలబెట్టాలని ఉత్సాహంతో ఉన్నాడు. అడుగుపెట్టిన చోటల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అధికార మార్పిడికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అందుకే వారిలో చైతన్యం నింపుతున్నారు. వైసీపీపై ప్రజల్లో ఏర్పడిన అసహనాన్ని తూర్పార పడుతున్నారు. డెవలప్ మెంట్ చేసే వారిని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు.
లోకేష్ చేస్తున్న పాదయాత్రలో వైసీపీలో కూడా ప్రకంపనలు పుడుతున్నాయి. అధికారం చేజారుతుందో ఏమో అనే భయం పట్టుకుంది. దీంతో వారి సభలను అడ్డుకోవాలని చూస్తోంది. కానీ లోకేష్ మాత్రం పట్టించుకోవడం లేదు. ముందుకే వెళ్తున్నాడు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పగ్గాలు వేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు.
లోకేష్ పాదయాత్రపై తల్లి భువనేశ్వరి ఎమోషనల్ కామెంట్లు చేసింది. లోకేష్ బాధ్యతాయుతమైన వ్యక్తిలా మారడం సంతోషంగా ఉంది. ప్రజల కోసం బతికే అతి కొద్ది నాయకుల్లో లోకేష్ ఒకరు. అందుకే అతడు నిండు ఆయురారోగ్యాలతో ప్రజల కోసమే పనిచేసే బలం అతడికి కలగాలని కోరుకుంది. ప్రజల కోసం పనిచేసే వారికి నిరంతరం ప్రజలు నీరాజనాలు అందుకోవడం సహజమే. అలా లోకేష్ తన ప్రస్థానం కొనసాగించి అనుకున్న గమ్యం చేరుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.