Nagababu : జంతువు జంతువును చంపి తినడం మృగధర్మం. లేకపోతే దానికి మనుగడ లేదు. కానీ మనిషికి అందుబాటులో ఉన్నా మాంసంపై ఆశతో జంతువును, పక్షులను చంపి తింటున్నాడు. కొంచెం కూడా మానవత ధర్మం పాటించడం లేదు. మాంసం తినే జంతువుల లక్షణాలు మనిషికి లేవు. మాంసం తినే జంతువులు నాలుకతో నీళ్లు తాగుతాయి. కోరల్లాంటి పళ్లు ఉంటాయి. వాటికి కుళ్లిన మాసం కూడా సువాసన వస్తుందట. కానీ ఇవేవీ మనిషికి లేవు. అంటే మనిషి మాంసం తినేందుకు అర్హుడు కాడు. కానీ తనలో కూడా ఓ జంతువు దాగి ఉందని తానే నిరూపించుకుంటున్నారు.
గౌతమ బుద్ధుడు జీవహింస పాపమని చెప్పాడు. కానీ ఎంత మంది దీన్ని పాటిస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ నటుడు, నిర్మాత నాగేంద్రబాబు చేరారు. జంతువులను చంపి తినడమంటే పాపమని మాంసం తినడం మానేశారు. కేవలం కూరగాయలే తింటున్నాడు. పాలు, పెరుగు, వెన్న వంటి పాల ఉత్పత్తులను కూడా మానేశారు. ఆయనలో మరో మానవతా వాది కనిపిస్తున్నారు.
ఇంతకు ముందు మాంసాహారం బాగా తినే వారు కానీ ఇప్పుడు అన్ని మానేశారు. కేవలం మొక్కల ద్వారా వచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు రావడంతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నానా రకాల చర్యలు తీసుకుంటున్నారు. వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకుంటున్నారు.
నాగబాబులో వచ్చిన మార్పుకు అందరు ఆశ్చర్యపోతున్నారు. యాంత్రిక జీవనంలో ఎవరు ఎంత కాలం ఉంటారో తెలియడం లేదు. ఉన్నంత కాలం మంచి భావాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయన అలవాట్లు మార్చుకోవడం మంచిదే. భవిష్యత్ లో కూడా తన జీవన విధానం ఇలాగే ఉంటుందని చెబుతున్నారు. అందరు కూడా నాగబాబు దారిలో నడిస్తే జీవహింస అనేది కనిపించదు.