Nagarjuna :
సమంత ఈ నడుమ మళ్లీ ట్రోలింగ్స్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా చైతూ నుంచి విడిపోయిన తర్వాత ఆమెపై వచ్చిన నిందలు, విమర్శలు అన్నీ ఇన్నీ కావు. భర్తను వదిలి బరి తెగించి తిరుగుతోందంటూ ఆమెను తిట్టని వారు కూడా లేరు. అప్పట్లో ఆమెపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. కానీ వాటన్నింటినీ ఓపిగ్గా భరించింది ఈ భామ. ఇక బయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేసింది.
తాజాగా సమంత-విజయ్ దేవరకొండ కలిసి నటించిన మూవీ ఖుషీ. ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే విజయ్ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన బిగ్ బాస్-7 ప్రారంభోత్సవానికి వచ్చేశాడు. పది మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయ్ గెస్ట్ గా వచ్చాడు.
హౌస్ లోకి వెళ్లి అందరినీ ఉత్సాహపరిచాడు. ఈ క్రమంలోనే నాగార్జున మాట్లాడుతూ.. నీ హీరోయిన్ ఎక్కడ అని అడిగాడు. విజయ్ స్పందిస్తూ.. సమంత ప్రస్తుతం యూఎస్ ప్రీమియర్స్ ప్రమోట్ చేయడానికి వెళ్లిందని తెలిపాడు. త్వరలోనే ఇద్దరం కలిసి ఇక్కడ ప్రమోషన్లు చేస్తామని వివరించాడు
ఇక సమంత గురించి నాగార్జున మాట్లాడుతూ.. సామ్ చాలా బ్రిలియంట్ యాక్టర్. వెరీ ట్యాలెంటెడ్ పర్సన్ అంటూ ప్రశంసించాడు. ఇక సమంతతో నటించడం వల్ల ఎవరు ఎవరిని డామినేట్ చేశారు అని నాగార్జున అడిగుతూ ఇలా మాజీ కోడలిపై ప్రేమను కురిపించాడు నాగ్. చైతూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత మొదటి సారి సమంత గురించి స్పందించాడు నాగార్జున. ఇదంతా చూస్తుంటే ఆయనకు మాజీ కోడలిపై ప్రేమ తగ్గలేదని అనిపిస్తోంది.