Puri Jagannath Mahesh Babu : పూరీజగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన పోకిరి సూపర్ హిట్టయింది. అటు పూరీకి ఇటు మహేష్ బాబుకు పేరు తీసుకొచ్చింది. ఇక వెనుకకు తిరిగి చూసుకోలేదు. ఇద్దరు కూడా వరుస హిట్లతో దూసుకుపోయారు. పరిశ్రమలో తనమకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు. పోకిరి అప్పట్లోనే కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో వారి కాంబినేషన్ కు మంచి క్రేజీ ఏర్పడింది.
తరువాత వారి కాంబినేషన్ లో బిజినెస్ మేన్ వచ్చింది. అది కూడా సూపర్ హిట్టయింది. దీంతో వారి మధ్య మూడో సినిమా రావాలని అభిమానులు ఆశించినా కుదరడం లేదు. దీంతో దీనికి పూరీ జగన్నాథ్ కూడా శ్రీకారం చుట్టాలని భావించారు. జనగణమన సినిమాను మహేష్ బాబుతో తీయాలని కలలు కన్నారు. కానీ ఆ అవకాశం దక్కడం లేదు.
మహేష్ బాబుకు పూరీ జగన్నాథ్ ఫోన్ చేసినా తీయడం లేదట. దీంతో ఫెయిల్యూర్ లో ఉన్న వారిని మహేష్ బాబు పట్టించుకోడని పూరీ చెబుతున్నాడు. వరుస ప్లాపులు రావడంతో పూరీజగన్నాథ్ కు ఎవరు సమయం ఇవ్వడం లేదు. దీంతో ముచ్చటగా మూడో సినిమా ప్రాజెక్టు కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు పూరీల కాంబినేషన్ మరోమారు కుదిరే అవకాశాలు లేవని తెలుస్తోంది.
మహేష్ బాబును కలవాలని వచ్చినా అతడి భార్య అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదట. దీంతో పూరీ, మహేష్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. వారు కలుసుకోనివ్వకుండా నమ్రత అడ్డుగా ఉంటోందని చెబుతున్నారు. సక్సెస్ లు లేకపోతే ఎవరు కూడా కేర్ చేయరని పూరీ తెగ బాధపడిపో తున్నాడట. తనకు కలిగిన పరాభవానికి కుంగిపోతున్నాడట. ఇలా మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ ల కలయికలో మళ్లీ సినిమా వస్తుందో లేదో అనే సందేహాలు వస్తున్నాయి.