Nara Brahmani : టీడీపీ అధినేత నారా చంద్రబాబును జగన్ ప్రభుత్వం కుట్రపన్ని జైలుకు పంపింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా విచారణ జరుపుతామని అరెస్ట్ చేస్తామంటూ ఏపీ అధికారులు వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ తరుఫున బలంగా నిలబడేందుకు.. వైసీపీ రాజకీయ కుట్రలను ఎదిరించేందుకు నారా బ్రాహ్మణిని రాజకీయాల్లో రావాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. ఈ మేరకు బ్రాహ్మణి తెలివితేటలను ఉపయోగించుకోవాలని చూస్తోంది.
ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ రాజకీయాల్లో ఉంటే కోడలు బ్రాహ్మణినే చంద్రబాబు వ్యాపార వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. హెరిటేజ్ సంస్థను నిర్వహిస్తున్నారు. నారా బ్రాహ్మణిని ఎంపీగా పంపించాలని చంద్రబాబు, లోకేష్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు.
25 పార్లమెంటు సెగ్మెంట్లలో విజయవాడ లోక్సభ స్థానానికి అధిక ప్రాధాన్యత ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన కోడలు నారా బ్రాహ్మణిని 2024లో విజయవాడ నుంచి బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు కారణం ప్రస్తుత ఎంపీ కేశినేని నాని తమ్ముడు శివనాథ్తో విభేదాలు, కేశినేని సోదరుల పోరుతో టీడీపీ నాయకత్వం ఆందోళన చెందడమే. విజయవాడ లోక్సభ టిక్కెట్ తనకు ఇవ్వాలని శివంత్ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.
చంద్రబాబు, లోకేష్ లపై కేసులు నమోదై జైలుకు వెళితే పార్టీ బాధ్యతలను బ్రాహ్మణికి అప్పగించాలని చూస్తున్నారు.