NTR called Akkineni : సాధారణ వ్యక్తిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి అసాధారణ వ్యక్తిగా మారిన నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరోగానే కాకుండా దాతృత్వం కలిగిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఆయన రాణించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేశారంటే ఆయన నిబద్ధత, అకుంఠిత ధీక్ష ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. ఈయన నుంచి ఆయన కుటుంబంలోని వారు చాలా మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. హీరోలుగా ఎదిగుతూ నేడు టాలీవుడ్ నే శాసిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.
టాలీవుడ్ లో నందమూరి కుటుంబం మొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ మరణానికి సంబంధంచి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఎన్టీఆర్ చనిపోయే ముందు హీరో అక్కినేనికి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో రచయిత కృష్ణ కుమారి చెప్పారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మంచి మిత్రులని వెల్లడించారు. ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తుల వల్ల వారి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయని రచయిత తెలిపారు.
చాలా కాలం తర్వాత మళ్లీ వారిద్దరూ కలిసిపోయారు. ఎన్టీఆర్ అక్కినేనికి ఫోన్ చేసి తన ఇంటికి రావాలని కోరారట. నీతో కలిసి భోజనం చేయాలి.. కొంచెం మాట్లాడేది ఉందని తెలిపారట. వస్తానని ఏఎన్ఆర్ కూడా చెప్పారట. ఇక ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాలనుకునే సమయానికి ఆయన మరణించాడని వార్త విన్నారట. దీంతో అక్కినేని తీవ్ర దిగ్భ్రాంతి చెందారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.