NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త భాష్యం చెప్పిన నేత. రాజకీయాలకు అర్థం చెప్పిన ధీరుడు. తరాలు మారినా ఆయన సేవలు స్మరించుకోవడం సహజం. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తున్నారు. సినిమాలు, రాజకీయాల్లో సమంగా రాణించి ప్రజల ప్రశంసలు పొందిన నేతగా ఆయన సేవలు చిరస్మరణీయం.
నేడు ఎన్టీఆర్ వర్ధంతి. ఈ సందర్భంగా చికాగోలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో ఆయన వర్థంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు అనిల్ సుంకర, చంద్రశేఖర్ పెమ్మసాని, రామక్రిష్ణ గుళ్లపల్లి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి చికాగో ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షుడు రవి కాకర, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పెదమల్లు, ట్రెజరీ విజయ్ కొరపాటి, రీజినల్ కౌన్సిల్ చిరంజీవి గళ్లా, హను చెరుకూరి, హరీష్ జమ్ముల, శివ త్రిపురనేని, క్రిష్ణ మోహన్, మూర్తి కొప్పాక, సునీల్ అరుమిల్లి, కల్యాణ్ విష్ణు విలాస్, నాగేంద్ర వేగే, ప్రమోద్ చింతమనేని తదితరులు తమ సహాయ సహకారాలు అందజేశారు.
ఎన్టీఆర్ తన జీవితంలో ఎన్నో విజయాలు అందుకున్నారు. రాజకీయాల్లో సినిమాల్లో తనదైన శైలిలో దూసుకెళ్లారు. ఇప్పటికి కూడా ఆయన సినిమాలంటే ఇష్టపడేవారున్నారు. అలా ఎన్టీఆర్ తన జీవితమంతా సేవల కోసమే కేటాయించారు. రాజకీయాల్లో కూడా ప్రజలకు మంచి పథకాలు అందించారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ఆయన ప్రారంభించిందే.
అలా ఎన్టీఆర్ రెండు రంగాల్లో విశేషంగా రాణించారు. హీరోగా ముఖ్యమంత్రిగా విభిన్న పాత్రలు పోషించారు. ప్రజలకు సేవ చేయడంలోనే తన జీవితమంతా గడిచిపోయింది. ఈనేపథ్యంలో ఎన్టీఆర్ జీవితం ప్రజలకే అంకితం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.