Poonam Kaur Sensational Note :
పూనమ్ కౌర్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె కేంద్రంగా ఎప్పటికప్పుడు వివాదాలు చాలానే నడుస్తాయి. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ పేరు చెప్పగానే అందరికీ టక్కున ఈమె పేరు, ఆమె వల్ల వచ్చే వివాదాలే గుర్తుకు వస్తుంటాయి. అయితే అప్పుడప్పుడు పవన్ మీద ఆమె కూడా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేస్తూనే ఉంటుంది.
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ మేరకు ఆమె ప్రెస్ నోట్ విడుదల చేసింది. నన్ను చాలామంది రాజకీయాల్లోకి లాగాలని చూస్తున్నారు. నేను ఏ రాజకీయ పార్టీలో కూడా లేను. కానీ కొందరు రాజకీయ నాయకులు వారి స్వప్రయోజనాల కోసం నన్ను ఒక పావుగా వాడుకుంటున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా పైశాచిక ఆనందం కోసం ఇలా చేయాలని చూస్తున్నారు.
నేను సిక్కు బిడ్డను. నాకు పోరాటాలు చేయడం తెలుసు. ఇప్పుడు నేను చేనేత కార్మికుల కోసం దేశ వ్యాప్తంగా పోరాడుతున్నాను. వారి హక్కుల కోసం పోరాడుతాను. నా వైపు నుంచి ఏదైనా తెలియజేయాల్సింది ఉంటే నేనే చెబుతాను అంటూ పూనమ్ కౌర్ పేరుపై పత్రిక ప్రకటన విడుదలైంది. అయితే ఆమె ఎవరి పేర్లు కూడా ఇందులో చెప్పలేదు.
తనను రాజకీయాల్లోకి లాగొద్దని మాత్రమే చెప్పింది. అయితే పూనమ్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె కావాలనే ఇలాంటి కామెంట్లు చేసిందా.. లేదంటే ఎవరైనా చెప్పించారా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ సమయంలో ఆమె ఇలాంటి ప్రకటన చేయడం ప్రాముఖ్యత సంతరించుకుంది.