Prabhas ; పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’.. బాలీవుడ్ లో చారిత్రక సినిమాలను తెరకెక్కిస్తూ మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటిస్తే కృతి సనన్ సీత పాత్రలో నటించింది.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించగా ఈ సినిమాపై భారీ హైప్ పెరిగింది. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు రేపటితో నిరీక్షణ పూర్తి అవ్వనుంది. ఈ సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కానుంది.. టి సిరీస్ సంస్థ పై ఈ సినిమా 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మరి అదే రేంజ్ లో బిజినెస్ కూడా చేసింది..
ఇక ఈ సినిమాలో నటించిన భారీ తారాగణం కోసం ఆదిపురుష్ నిర్మాత బాగా ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో కీలక రోల్స్ చేసిన వారు ఎవరెవరు ఎంత తీసుకున్నారో చూద్దాం.. లక్ష్మణుడి పాత్రలో నటించిన సన్నీ సింగ్ 1.5 కోట్లు, సీత పాత్రలో నటించిన కృతి సనన్ 3 కోట్లు విలన్ లంకేశ్వరుడు రోల్ చేసిన సైఫ్ అలీ ఖాన్ 12 కోట్లు పుచ్చుకున్నారట..
మరి ఈ రేంజ్ లో పారితోషికాలు తీసుకున్నారు కాబట్టి మేకింగ్ తో కలిపి మొత్తం 500 కోట్ల వరకు అయ్యింది అని అంటున్నారు. గత రెండు సినిమాలతో ప్లాప్ అందుకున్న ప్రభాస్ ఈసారి మాత్రం హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ..
ReplyForward
|