Sadhguru Health Condition : భారత్ లో అత్యంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ బ్రెయిన్ హిమరేజ్ కారణంగా ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ నెల 17న ఆయనకు అత్యవసర మెదడు సర్జరీ చేశారు. ఆయన ఇవ్వాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
సద్గురు ఆరోగ్యం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫాలోవర్స్ తో పాటు ప్రధాని మోదీ సహ పలువురు ప్రముఖులు ఆరా తీశారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. దీంతో డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇచ్చారు. తాజాగా ఆయన కోలుకున్నారని.. చక్కగా నడుస్తున్నారని అందుకే డిశ్చార్జి చేసినట్టు అపోలో గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి ట్వీట్ చేశారు.
సద్గురు డిశ్చార్జి సందర్భంగా సంగీతారెడ్డి ఆయన్ను కలిసి పుష్పం అందించి, త్వరగా రికవరీ అయినందుకు కృతజ్ఞతలు చెప్పారు. సద్గురు బ్రెయిన్ సర్జరీ చేసిన అపోలో వైద్య బృందంలో డాక్టర్లు వినిత్ సూరి, ప్రణవ్ కుమార్, సుధీర్ త్యాగి, ఎస్ చటర్జీలతో సహ ఢిల్లీకి చెందిన పలువురు ఉన్నారు. ఇకపై ఆయన దినచర్యలు యథావిధిగా చేసుకోవచ్చని వారు సూచించారు.