Siddhu Chiranjeevi : ప్రజెంట్ యూత్ లో మాస్ క్రేజ్ ఉన్న హీరో అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు సిద్దు జొన్నలగడ్డ. ఆయన కెరీర్ ‘డీజే టిల్లు’కు ముందు ఆ తర్వాత అని చెప్పవచ్చు. అతకు మందు ఆయన కొన్ని సినిమాల్లో నటించారు కానీ అవి ఆయనకు ఏ మాత్రం గుర్తింపు తెచ్చిపెట్టలేదు సరికదా.. కెరీర్ ముగుస్తుంది అనుకున్నాడు. ఇక డీజే టిల్లు రావడంతో ఒక్కసారిగా మాస్ లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.
సిద్దు గతంలో ‘గుంటూరు టాకీస్’ వంటి సూపర్ హిట్ సినిమాలో నటించాడు కానీ, గుర్తింపు మాత్రం దక్కలేదు. ఇక లాక్ డౌన్ సమయంలో రానా నిర్మించిన ‘కృష్ణ అండ్ హిస్ లీల’తో యూత్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించాడు. అది కూడా అంతగా సక్సెస్ కాలేకపోయింది. సిద్ధు హీరోగానే కాకుండా స్క్రిప్ట్ రైటర్ కూడా.. ‘డీజీ టిల్లు’కు ఆయనే స్క్రిప్ట్, మాటలు అందించారట. ఇక విడుదలకు సిద్ధమవుతున్న ‘టిల్లు స్క్వేర్’కు కూడా స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ ఆయన ఇచ్చినవేనట.
ఇంత టాలెంట్ ఉండి కూడా మంచి అవకాశాలు లేక అంతగా రాణించలేకపోయారు సిద్దూ. ఇక డీజే టిల్లు ఆయన కెరీర్ ను పూర్తిగా మార్చివేసింది. మాస్ లో మంచి ఫాలోయింగ్ పెంచింది. డిఫరెంట్ డైలాగ్స్, మాడ్యులేషన్ ఆయనకు విపరీతంగా హైప్ ను పెంచాయి. డీజే టిల్లు భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సమయంలోనే నిర్మాత టిల్లు స్క్వేర్ ను అనౌన్స్ చేశారంటే మాటలు కాదు.
ఇప్పుడు సిద్దు సినిమాకు యూత్ ఒక్కటే కాదు ఫ్యామిలీలు కూడా తెగ చూసేస్తున్నారు. జోక్స్ అది తెలంగాణ యాసతో వామ్మో థియేటర్ నవ్వులతో అదిరిపోవాల్సిందే. ఇంతటి హైప్ సంపాదించుకున్న ఆయన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచేశారు. టిల్లు స్క్వేర్ సినిమాకు రూ. 3కోట్ల 50 లక్షల పారితోషికం తీసుకున్నారంట.
మెగాస్టార్ చిరంజీవి-వశిష్ట కాంబోలో వస్తున్న వస్తున్న సినిమాలో సిద్దూ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమాలో ఆయనకు సబంధించిన కొన్ని సీన్స్ ఉండనున్నాయి. అయితే ఇందులో కనిపించేది తక్కువ సమయమే అయినా రూ. 4 కోట్లు తీసుకుంటున్నారట. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే చాలు అనుకున్న రోజుల నుంచి కోట్లాది రూపాయల డబ్బులను డిమాండ్ చేసేంత ఎదిగిన తీరుపై ప్రతీ ఒక్కరూ ప్రశంసలు కురిపించాల్సిందే..