AP govt school : ఏపీలో సర్కారు స్కూళ్లలో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. మరోవైపు ఏపీలో జగనన్న తెస్తున్న మార్పులు చూస్తుంటే.. నాకూ చదువుకోవాలనిపిస్తోంది ” అంటూ వైసీపీ నేతలు డబ్బా మాత్రం కొట్టుకుంటున్నారు. లక్ష్మీపార్వతి, రోజా లాంటివారైతే ఒక అడుగు ముందుకేసి ఆ పాఠశాలలోనే చదివి ప్రజాప్రతినిధులు అయినట్లుగా ఫీల్ అవుతున్నారు.
అయితే నిజానికి ప్రభుత్వ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదట. చేరిన వారు కూడా తిరిగి ప్రైవేటుకు వెళ్లిపోతున్నారని సమాచారం. 2022 సెప్టెంబరు నాటికి ఏపీలోని ప్రభుత్వ బడుల్లో 41,38, మంది విద్యార్థులున్నారు. 2023 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 39,95,9కి తగ్గింది. అంటే స్కూల్లో చేరిన విద్యార్ల సంఖ్య క్రమంగా తగ్గింది అన్నమాట . ఈ విద్యా సంవత్సరంలో కేవలం 37,50,293 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మరింత తగ్గింది. వీరంతా ప్రభుత్వ బడుల్లో పాఠాలు చెప్పడం లేదని ప్రైవేటు పాఠశాలలో చేరిపోయారు. దీనికి కారణం విలీనం, టీచర్ల కొరతగా తెలుస్తున్నది.
విద్యాసంస్కరణల పేరిట ప్రభుత్వం ఏదో చేస్తున్నామని డబ్బా కొట్టుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదని సమాచారం. పాఠశాలల విలీనం తర్వాత పిల్లలను బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చేర్పించేందుకు విముఖత చూపుతున్నారు. ఏపీలో కూడా ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగిపోయాయి. దీంతో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ఏదైనా ఏపీలో జగనన్న బడుల బాగు కోసం ఏదో చేశారని వైసీపీ నేతలు, సంబంధిత మీడియా చెబుతున్నా దానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి చాలా తేడా కనిపిస్తున్నది.
ReplyForward
|