Best Shot Of This Century : ఇండియాలో అత్యంత ఎక్కువ ఆదరణ కలిగిన ఆటగా క్రికెట్ వర్దిల్లుతున్నది. అందుకే ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్నది మన దేశపు క్రికెట్ బోర్డు. అయితే మన దేశ ఆటగాళ్లు కూడా క్రికెట్ లో రికార్డులు సృష్టించడంలో ముందుంటారు. ఇక టీమిండియాలో స్టార్ బ్యాట్స్ మన్ కు కొదవలేదు. నాటి నుంచి వరకు ఎందరో ఆటగాళ్లు క్రికెట్ క్రీడా చరిత్రలో ఎన్నో రికార్డులను నెలకొల్పి తమకు సాటి మరెవరూ లేరని నిరూపించారు.
ఇక తాజాగా స్టార్ బ్యాట్స్ మెన్ కింగ్ కోహ్లీ కూడా అరుదైన ఘనత దక్కించుకున్నాడు. మరెవరికీ సాధ్యం కాని రికార్డును నెలకొల్పాడు. ఈ రన్ మెషిన్ వన్డేల్లో ఇప్పటికే సచిన్ పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డడును సమం చేశాడు. అయితే గతేడాది పాకిస్థాన్ పై కింగ్ కోహ్లీ ఆడిన షాట్ ఈ శతాబ్దంలోనే అత్యుత్తమమైనదిగా ఐసీసీ పేర్కొంది. గతేడాది టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ బౌలర్ రవూఫ్ బౌలింగ్ లో కోహ్లీ సిక్సర్ కొట్టాడు. పాక్ పై ఆడిన ఈ ఇన్నింగ్స్ తన ఫేవరేట్ అంటూ గతంలో కోహ్లీ ప్రకటించాడు.
2022 టీ 20 ప్రపంచకప్ లో దాయాదిల పోరులో కోహ్లీ వీరవిహారం చేశాడు. 53 బంతుల్లో 82 పరుగులతో భారత్ కు విజయాన్ని అందించాడు. అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. అయితే కోహ్లీ ఈ మ్యాచ్ లో నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇందులో హారిస్ రవూఫ్ వేసిన బంతిలో స్ర్టెయిట్ హిట్ అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఇది అత్యుత్తమ షాట్ అంటూ సీనియర్ ఆటగాళ్లు ఎందరో కొనియాడారు.