పండ్లలో రారాజు మామిడి. దీన్ని చూస్తే తినకుండా ఉండలేరు. అంతలా లొట్టలేసుకుని తినాలనిపిస్తుంది. దీంతో మామిడిపండును తిననివారుండరంటే అతిశయోక్తి కాదు. అందులో ఉండే పోషకాలు కూడా అలాంటివే. మామిడిపండు తినాలని అందరికి అనిపిస్తుంది. ఆకర్షణీయమైన రంగులో అందరిని కట్టిపడేస్తుంది. పచ్చి మామిడి ముక్కలపై ఉప్పు, కారం చల్లుకుని తింటే ఆ మజాయే వేరు.
ఇలా మామిడితో మన అనుబంధం ఉంటుంది. ఫలాల్లో మేటిగా చెబుతారు. దీంతో మామిడిని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీన్ని తినడం వల్ల వేడి చేస్తుందని, సెగ గడ్డలు వస్తాయని అపోహ పడుతుంటారు. కానీ అందులో నిజం లేదు. మామిడి తినడం వల్ల ఎలాంటి చిక్కులు రావు. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఇవి ముందుంటాయి. సీజనల్ గా దొరికే పండు కావడతో ఇష్టంగా తింటుంటారు.
మామిడి సండ్లను మధుమేహం ఉన్న వారు తినకూడదు. ఒకవేళ తింటే అందులో ఉండే గ్లూకోజ్ చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీంతో షుగర్ కంట్రోల్ తప్పుతుంది. ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో షుగర్ పేషెంట్లు మామిడి పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ తినాలనిపిస్తే ఒకటి తిని ఊరుకోవాలి. అంతేకాని రెండు మూడు లాగిస్తే అంతే సంగతి.
మంచి పండ్లను చూసి కొనుక్కోవడం మంచిది. సహజంగా పండించే పండ్లు ఉంటాయి. రసాయనాలు వేసి పండించే పండ్లు ఉంటాయి. అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. సహజంగా పండించే వాటితో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మందులు వేసి పండిస్తేనే మనకు అనారోగ్యం కలుగుతుంది. ఇవి గుర్తుంచుకుని మంచి పండ్లు కొనుక్కుని తినేందుకు ప్రయత్నించడం శ్రేయస్కరం.