పాకిస్థాన్ పౌరులకు అగ్రరాజ్యం అమెరికా శుభవార్త తెలియజేసింది. త్వరలోనే పాక్ పౌరులకు వీసాలను మంజూరు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెరికాపై అల్ ఖైదా దాడుల తర్వాత పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ దేశాల విషయంలో. అమెరికాలో పాక్ పౌరులకు వీసాలను అప్పట్లో మంజూరు చేయలేదు. అంతేకాకుండా ఆ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అమెరికాలో అడుగు పెడితే సెక్యూరిటీ రీజన్స్ తో చాలా ఇబ్బంది పెట్టారు కూడా.
అయితే సెప్టెంబర్ దాడులు జరిగి రెండు దశాబ్దాలు దాటి పోయాయి. దాంతో ఇప్పుడు అమెరికాలో ముస్లిం ల పట్ల అలాగే నల్ల జాతీయుల పట్ల కాస్త ఉపశమనం కలిగించే చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే పాక్ పౌరులకు వీసాలను పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది అమెరికా.