Nerella : ఎండాకాలం నేపథ్యంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోనా ధర్మపురి మండలం నేరెళ్లలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని కోరుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. ఎండలు మండిపోతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.