Weather Report : ఏపీలో వడగాడ్పులు ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. సగానికి పైగా జిల్లాల్లో వడగాడ్పులు వీస్తున్నాయి. పలుచోట్ల 42 నుంచి 44 డిగ్రీలు, 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి ఈ నెల చివరి వరకూ కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం 41 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 116 మవడలాల్లో వడగాల్పులు వీచాయి. శనివారం మరింత ఉధృతంగా వడగాల్పులు వీచే అవకాశముంది.
శుక్రవారం అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో 45.3, పల్నాడు జిల్లా మాచర్లలో 45.2, కర్నూలు రూరల్ లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6, ప్రకాశం జిల్లా మార్కాపురంలో, విజయనగరం జిల్లా కొత్తవలసలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులు తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించంది.