Infosys Narayanamurthy : లోక్ సభ రెండో విడత ఎన్నికల్లో భాగంగా బెంగళూరులో అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఓటు వేసి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. పోలింగ్ ఉండడంతో డిశ్చార్జ్ చేయించామని, మాలాంటి వృద్ధులే వచ్చి క్యూలో నిలబడి ఓటేస్తున్నారు. యువత కూడా ఓటేయాలి.. అని నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి సూచించారు. ఇది ఐదేళ్లకు ఓసారి వచ్చే అవకాశమని, బాధ్యతాయుతంగా ఓటు వేయాలని సుధామూర్తి చెప్పారు. సాధారణంగా విద్యావంతులు తక్కువ సంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. మీ హక్కును మీరు తప్పకుండా వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
మామూలుగా బెంగళూరులో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. దానిన ఉద్దేశించి ఆమె స్పందించారు. నారాయణమూర్తి దంపతులు జయనగరలోని బీఈఎస్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు.