నువ్వే మా నమ్మకం జగన్ రెండు వరాల పాటు ఇంటి ఇంటికి వెళ్లి స్టిక్కర్లు ప్రతి ఇంటికి అంటించారు వైసీపీ శ్రేణులు .. కానీ ఇక్కడే కొత్త చిక్కు వచ్చి పడింది. వైసీపీ శ్రేణులు స్టిక్కర్లు వేసిన కొద్దీ సేపటికే ఇంట్లో వాళ్ళు ఆ స్టిక్కర్లను తోలగిస్తున్నారు..
విషయంలోకి వెళ్తే నువ్వే మా నమ్మకం అనే నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ జగన్ ఫోటో కూడిన స్టిక్కర్లను ప్రతి ఇంటికి వెళ్లి అంటించారు.. ప్రతి ఇంటికి అనుకున్న సమయంలో అన్ని ఇళ్లకు చేరుకోవడం వీలు కాకపోవడంతో ఇంకా కొంత సమయం పెంచుకొని మరి ప్రతి ఇంటికి వెళ్లి స్టిక్కర్ల అంటించారు…అయితే ఏ ఇంటి ముందు చూసినా స్టిక్కర్లు కనిపించడం లేదు. దీంతో అసలు ప్రోగ్రాం జరిగిందా లేదా అన్న డౌట్ చాలా మందికి వచ్చేస్తోంది. స్టికర్లు అంటించే వాళ్లు కూడా.. తాము అంటించే వరకూ ఉంచుకోండి… తాము వెళ్లిపోయిన తర్వాత మీ ఇష్టం అని బతిమాలుకున్నారు.
175 సీట్లు గెలుస్తాం అని అని చెప్పు కునే సజ్జల రామకృష్ణా రెడ్డి సీట్లు గెలవడం ఏమో కానీ ముందు స్టిక్కరు ఇంటికి ఉండేలా చూసుకోవాలని, స్టిక్కర్లు కనిపినచ్చడం లేదు రామకృష్ణా అని ప్రతిపక్ష నాయకులూ ఎద్దేవా చేస్తున్నారు
జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ అని చెప్పుకునే వర్గాల కాలనీల్లోనూ స్టిక్కర్లు అంటించిన గంటకే కనిపించడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి.. తమకు చాలా గొప్ప పాజిటివ్ నెస్ ఉందని ప్రచారం చేసుకోవడానికి.. మిస్డ్ కాల్స్ అంటూ త్వరలో ప్రకటించుకుని… తమకు 175 స్థానాలు వస్తాయని చెప్పుకోవచ్చు గాక.. రియాలిటీ ఏమిటో తెలుసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.