టెన్త్ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. టెన్త్ పేపర్ లీక్ కుట్రకు బాధ్యుడు అంటూ ఏకంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేయడమే కాకుండా ఏకంగా ఏ 1 నిందితుడిగా నమోదు చేసారు పోలీసులు. ఇక ఈ కేసులో తాజాగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేసారు.
అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని స్పష్టం చేసారు ఈటల. ఒకవేళ నోటీసులు వస్తే తప్పకుండా బాధ్యత కలిగిన పౌరుడిగా సమాధానం ఇస్తానని స్పష్టం చేసారు. టెన్త్ పేపర్ లీక్ లో అరెస్ట్ అయిన బండి సంజయ్ ను అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టు ను కోరుతున్నారు. ఇక ఇదే సమయంలో బండి సంజయ్ కు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసారు బండి లాయర్లు.