చిరంజీవి నటించిన పున్నమినాగు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో చిరంజీవి నటనకు మంచి పేరు వచ్చింది. నాగులుగా చిరు అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో ఈ సినిమాలో నటించినందుకు ఫిలిం ఫేర్ అవార్డు కూడా వచ్చింది. అద్భుతమైన సినిమాగా పున్నమినాగు రికార్డులు తిరగరాసింది.
సినిమాలో చిరంజీవి తండ్రి చిన్నప్పటి నుంచి అతడి ఆహారంలో విషం కలిపి ఇవ్వడం వల్ల చిరు శరీరం మొత్తం విషంగా మారుతుంది. అతడికి పాము కుట్టినా ఏం కాదు. అలా శరీరం మొత్తం విషంగా మారడంతో అతడు ఏ అమ్మాయితో కలిసినా ఆమె ప్రాణాలు కోల్పోతుంది. దీనిపై రాజు అనే అతడు చిరు మీద అనుమానంతో నిఘా పెడతాడు. చివరకు చిరంజీవి ఇదంతా చేస్తున్నాడని నిరూపిస్తాడు.
అప్పట్లో ఏవీఎం సినిమాల్లో పాములే ప్రధానంగా ఉండేవి. అదేకోవలో ఈ సినిమా కూడా అలాగే తీశారు. ఇందులో హీరోయిన్ గా మేనక నటించింది. ఆమె ఎవరో కాదు సాక్షాత్తు కీర్తి సురేష్ కు స్వయానా తల్లి. ఆమె కేవలం రెండు తెలుగు చిత్రాల్లో మాత్రమే నటించింది. ఇప్పుడు చిరంజీవి, కీర్తి సురేష్ లు భోళాశంకర్ సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటిస్తుండటంతో ఆనాడు తల్లితో నేడు కూతురుతో చిరు నటించడం విశేషం.
ఇలా కీర్తి సురేష్ కు పున్నమినాగుతో ఉన్న అనుబంధం అలాంటిది. చిరంజీవి తల్లితో పాటు కూతురుతో నటించడం గమనార్హం. భోళాశంకర్ కు దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమా ఏ వండర్ క్రియేట్ చేస్తుందోనని అందరు ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 11న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తల్లికి ఆ సినిమా పేరు తెచ్చినట్లుగానే ఈ సినిమా కూతురుకు సైతం పేరు తెస్తుందో లేదో చూడాల్సిందే మరి.
ReplyForward
|