chiranjeevi fans ఓ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగు ఏంటంటే నరికినా కొద్ది నీకు అలుపొస్తుందేమో కానీ నాకు ఊపొస్తుందని చెబుతాడు. అదే డైలాగు చిరంజీవికి సరిగ్గా సరిపోతుంది. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ శరవేగంగా నడిపిస్తున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా తనదైన శైలిలో నటిస్తున్నాడు. సినిమాల వేగంలో తన మార్కు చూపిస్తున్నాడు. కథల ఎంపికలో వేగాన్ని ప్రదర్శిస్తున్నాడు. కొత్త వారికి అవకాశం ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ లో నటించాడు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 11న విడుదల కాబోతోంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేదాళం అనే తమిళ సినిమాకు రీమేక్ గా దీన్ని నిర్మించారు. చెల్లెలి సెంటిమెంట్ తో సాగే కథగా చెబుతున్నారు. సినిమా షూటింగ్ ఇదివరకే పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి.
సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. రాజీ ఆఫ్ భోళా పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాటను మెహర్ రమేష్, ఫిరోజు ఇజ్రాయిల్ రచించారు. అసుర, ఫిరోజ్ పాడారు. చిరు డైలాగులు ఎలా ఉంటాయో తెలిసిందే.ఈ పాటను త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనేపథ్యంలో అభిమానులకు ఇక పండగే అంటున్నారు.
భోళా శంకర్ లో చిరంజీవికి జోడిగా తమన్నా నటిస్తోంది. కీర్తి సురేష్, సుశాంత్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, బ్రహ్మానందం, శ్రీముఖి, రష్మీ గౌతమ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై అభిమానులు ఆసక్తి పెంచుకున్నారు.