25.1 C
India
Wednesday, March 22, 2023
More

    టాలీవుడ్ లో మరో విషాదం : మిథునం నిర్మాత కన్నుమూత

    Date:

    Mithunam producer passed away
    Mithunam producer passed away

    టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. మిథునం నిర్మాత ముయిద ఆనందరావు ( 57 ) అనారోగ్యంతో మరణించారు. విజయనగరం జిల్లా రేగిడి మండలంలోని వావిలవలస గ్రామం ఆనందరావు స్వగ్రామం. అంచెలంచెలుగా ఎదిగి మిథునం అనే చిత్రాన్ని నిర్మించారు. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , లక్ష్మీ జంటగా నటించిన మిథునం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా లభించింది. విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించడం విశేషం.

    గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దాంతో విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు సాయంత్రం స్వగ్రామంలో ఆనందరావు అంత్యక్రియలు జరుగనున్నాయి.

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related