నిర్మాతల మండలి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఆరోపణలు , ప్రత్యారోపణల మధ్య యుద్ధ వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని అనుకున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఎలాంటి వాతావరణం లేకపోవడంతో సాఫీగానే ఎన్నికలు జరిగాయి. ఇక నిర్మాతల మండలి అధ్యక్షుడిగా దామోదర ప్రసాద్ ఎన్నికయ్యారు. దామోదర ప్రసాద్ కు 339 ఓట్లు రాగా అతడితో పోటీపడిన జెమిని కిరణ్ 315 ఓట్లు మాత్రమే సాధించారు. దాంతో దామోదర ప్రసాద్ విజయం సాధించగా జెమిని కిరణ్ ఓటమి పాలయ్యారు.
ఇక మిగతా కమిటీ విషయానికి వస్తే ……
సుప్రియ ( ఉపాధ్యక్షురాలు )
రామసత్యనారాయణ ( ట్రెజరర్ )
ప్రసన్న కుమార్ ( కార్యదర్శి )
వైవిఎస్ చౌదరి ( కార్యదర్శి )
భరత్ చౌదరి ( జాయింట్ సెక్రటరీ )
నట్టి కుమార్ ( జాయింట్ సెక్రటరీ )
కార్యవర్గ సభ్యులుగా …..
దిల్ రాజు
డివివి దానయ్య
రవికిశోర్
యలమంచిలి రవి
పద్మిని
బెక్కెం వేణుగోపాల్
సురేందర్ రెడ్డి
గోపీనాథ్ ఆచంట
మధుసూదన్ రెడ్డి
కేశవరావు
వజ్జా శ్రీనివాసరావు
అభిషేక్ అగర్వాల్
కృష్ణ తోట
రామకృష్ణ గౌడ్
కిషోర్ పూసల.