Priyanka Gandhi : మంగళసూత్రం విలువ తెలియకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ప్రియాంక గాంధీ అన్నారు. మహిళల మంగళసూత్రాలనూ కాంగ్రెస్ పార్టీ వదలదంటూ పీఎం మోదీ చేసిన ఆరోపణలపై ప్రియాంక గాంధీ స్పందించారు. బెంగళూరులో ఆమె మాట్లాడుతూ మంగళసూత్రం విలువ తెలియకుండా కాంగ్రెస్ పై పీఎం నరేంద్ర మోదీ ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తండ్రి రాజీవిగాంధీ హత్యోదంతాన్ని ప్రస్తావిస్తూ.. దేశం కోసం మా అమ్మ మంగళపూత్రాన్ని త్యాగం చేశారని చెప్పారు.
యుద్ధం సమయంలో తన నానమ్మ ఇందిగాంధీ సొంత బంగారాన్ని దేశం కొసం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 55 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజల బంగారాన్ని, మంగళసూత్రాలను దోచుకుందా అని బెంగళూరు ఎన్నికల సభలో ప్రశ్నించారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే మన తల్లులు, చెల్లెళ్ల బంగారాన్ని ఎక్కువ సంతానం కలిగిన వారికి దోచి పెడుతుందని పీఎం మోదీ ఇటీవల ఆరోపించడాన్ని ఆమె తప్పుబట్టారు.