అదానీకి ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న సంబంధం ఏంటి ? అని మరోసారి ప్రశ్నించాడు రాహుల్ గాంధీ. తనపై అనర్హత వేటు వేసిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చాడు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ పై నిప్పులు చెరిగాడు. నేను అదానీని ప్రశ్నిస్తుంటే బీజేపీ వాళ్ళు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు ? అని ప్రశ్నించాడు రాహుల్. 20 వేల కోట్ల సంపద ఆవిరయ్యింది. అది ఎవరి సొమ్ము ? అదానీ కంపెనీలో 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది ఎవరు ? దానికి సమాధానం కావాలి…… మోడీ ఈ ప్రశ్నలపై సమాధానం చెప్పగలడా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
నేను పదేపదే అదానీ – మోడీ ల గురించి ప్రశ్నించడంతో బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందన్నాడు. పార్లమెంట్ లో పలుమార్లు ప్రశ్నించాను సమాధానం లేదు. స్పీకర్ ను కలిసి ఆధారాలు ఇచ్చాను అయినా సమాధానం లేదు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటి నుండే అదానీతో సంబంధాలు ఉన్నాయని, నా లోక్ సభ సభ్యత్వం మళ్లీ పునరుద్ధరించినా ప్రశ్నించడం మాననని …… ఎందుకంటే క్షమాపణ కోరడానికి నేను సావర్కర్ ను కాదు……రాహుల్ గాంధీని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.