డార్లింగ్ ప్రభాస్ కు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ నోటీసులు ఎందుకో తెలుసా ……….. ఆదిపురుష్ చిత్రంలో రాముడిని , రావణాసురుడు , హనుమంతుడిని చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రాముడిని కించపరిచేలా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. దాంతో హీరో ప్రభాస్ తో పాటుగా దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు జారీ చేసింది కోర్టు.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం ఇటీవల టీజర్ విడుదల అయ్యింది. ఆ టీజర్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అచ్చం బొమ్మల సినిమాల ఉందని కామెంట్ చేస్తున్నారు. చివరకు డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సంతృప్తిగా లేరు. దాంతో సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి మిమ్మల్ని అలరించేలా ప్లాన్ చేస్తాం……. 3 డీ లో తప్పకుండా బాగుంటుందని అంటున్నాడు దర్శకుడు ఓం రౌత్.
అయితే అభిమానులు మాత్రం దర్శకుడి మాటలతో ఏకీభవించడం లేదు. అలాగే ఆదిపురుష్ టీజర్ చూసిన పలువురు సెలబ్రిటీలు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది 2023 జనవరి 12 న విడుదల కానుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.